Banner
Watermark
ఓటర్ జాబితాలో అభ్యంతరాలపై తెలియజేయాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
📅 06 January 2026, 04:26 PM ✍️ admin
News Image

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంరాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో విడుదల చేసిన ఓటర్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9వ తేదీ సాయంత్రం 05.00 గంటల లోగా తెలియజేయాలని చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితా పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఇంచార్జి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. గత నెల డిసెంబర్ 30వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ జాబితాను సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో డౌన్ లోడ్ చేసారని, దానిని గత నెల 31వ తేదీన వార్డుల వారీగా సిద్ధం చేశారని, జనవరి 01వ తేదీన రెండు మున్సిపల్ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులపై జాబితా అందుబాటులో పెట్టామని వెల్లడించారు. రాజకీయ పార్టీలతో జిల్లాలోని రెండు మున్సిపల్ కార్యాలయాల్లో ఈ నెల 05 వ తేదీన మీటింగ్ పెట్టామని వివరించారు. సిరిసిల్లలో మొత్తం 39 వార్డులు ఉన్నాయని, 39,942 మంది పురుష ఓటర్లు, 42,011 మహిళా ఓటర్లు, 06 ఇతర ఓటర్లు ఉన్నారని, వేములవాడలో మొత్తం 28 వార్డులు 19,580 మంది పురుష ఓటర్లు, 21,279 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 18 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 1,22,836 మంది ఓటర్లు ఉన్నారని ఆమె తెలిపారు. ఓటర్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ ల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 05.00 గంటల లోగా తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను ఆయా మున్సిపల్ కమిషనర్లు సీల్డ్ కవర్లో ఈఆర్ఓలకు పంపించాలని ఆదేశించారు.ఈ నెల 10 వ తేదీన తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు.

పలు పార్టీల ప్రతినిధులు డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి ఓటర్ల తొలగింపు, వార్డులో సీరియల్ నంబర్ వారిగా ఓటర్ జాబితా ఉండాలని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సూర దేవరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి, బీఆర్ఎస్ ప్రతినిధి జిందం చక్రపాణి, బీఎస్పీ ప్రతినిధి ఏ రమేష్, టీడీపీ ప్రతినిధి తీగల శేఖర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, డీ టీ సీ పీ ఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home