రాజన్న ఆలయం వద్ద 150 మంది అన్నార్తులకు భక్తులకు అన్నదానంతో పాటు స్వీట్ల పంపిణీ
📅 16 January 2026, 03:21 PM
✍️ admin
వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1731 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున రాజన్న ఆలయం వద్ద 150 మంది పేదలకు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్న దాతలుగా వరంగల్ వాస్తవ్యులు నామోజు దేవమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి కుమారుడు కోడలు నామోజు జగన్నాథచారి యాక లక్షి దంపతులు, మనుమడు మనుమరాలు నామోజు కనకచారి విజయలక్ష్మి దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష సాయికృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టినరోజు, పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూటైనా భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 92469 39388 నంబరుకు సంప్రదించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్ వొడ్యాల వేణు పాత సంతోష్ ప్రతాప నటరాజు సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ గొట్టం శ్రీనివాస్ నామాల మోహన్ తదితరులు పాల్గొన్నారు