నామినేషన్ల పరిశీలన (Scrutiny) ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
📅 31 January 2026, 01:06 PM
✍️ admin
జనవరి 31 జనగాం
నామినేషన్ల పరిశీలన (Scrutiny) ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. .. శనివారం
అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ (ఎల్ & బీ) తో కలిసి..మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు (ROs), మాస్టర్ ట్రైనర్ల తో గూగుల్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్బంగా.. నామినేషన్ల పరిశీలన (Nominations Scrutiny Process) విధానం గురించి కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు
నామినేషన్ల స్క్రూటినీ సమయంలో అనుసరించాల్సిన నియమాలు, ధ్రువపత్రాల పరిశీలన విధానం, అభ్యర్థుల అర్హతలు, రిజర్వేషన్ ప్రమాణాలు, చట్టపరమైన అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా నిష్పాక్షికంగా ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు.అలాగే స్క్రూటినీ ప్రక్రియలో ఏవైనా సందేహాలు వచ్చినపుడు వెంటనే ఉన్నతాధికారులతో సంప్రదించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.