Banner
Watermark
కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
📅 12 February 2026, 04:36 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి - 12
కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజెషన్ ప్రక్రియ గురువారం పూర్తి చేశారు.
జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రక్రియను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పూర్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home