Banner
Watermark
పేద ప్రజలకు ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి
📅 29 April 2026, 02:17 PM ✍️ admin
News Image
నేటి ప్రభాత దర్శిని, ఏప్రిల్ 29 ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి

నేటి ప్రభాత దర్శిని, ఏప్రిల్ 29 (ముస్తాబాద్ -ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం కింద నిర్మించుకున్న ఆకుల నరేష్, గృహప్రవేశం చేయుచున్న సందర్భంగా, గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది పేదల ప్రభుత్వమని, పేద ప్రజలకు ఇళ్ల సహకారం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని,ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొండం రాజిరెడ్డి, ఉచ్చుడి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home