Banner
Watermark
*క్లిష్టమైన శస్త్ర చికిత్సలకు నిలయంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి*
📅 30 April 2026, 01:43 PM ✍️ admin
News Image
*ప్రచురణార్థం డి సీ హెచ్ ఎస్ కార్యాలయం*
మంథని పట్టణానికి చెందిన 29 సంవత్సరాల ఒక యువకుడు ఈ నెల 16 రాత్రి 10 గంటలకు రోడ్డు ప్రమాదం లో తన బైక్ పై నుంచి డివైడర్ కు ఢీ కొనడం జరిగింది. ఈ ప్రమాదంలో అతని కుడి చేయి తీవ్రంగా గాయపడి, తీవ్ర రక్త స్రావం జరిగింది, ఆ యువకుడు వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శ్రీధర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పగా, వెంటనే స్పందించిన సూపరింటెండెంట్ గారు ఆ యువకుడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని చెప్పి, హుటాహుటిన జనరల్ సర్జరీ డాక్టర్ విష్ణు చంద్రికను పిలిపించి, లోతుగా అయిన గాయాలకు శస్త్ర చికిత్స నిర్వహించి, రక్త స్రావాన్ని ఆపారు
తర్వాత సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. కంది శ్రీనివాస్ రెడ్డి మరియు డా. వినయ్, వీరి తో పాటు మత్తు వైద్యురాలు డా. భవాని గార్లు సదరు యువకుడికి కండరాలు ,నరాలు,రక్త నాళాలను అత్యంత నైపుణ్యం తో 3 గంటలు శ్రమించి శస్త్ర చికిత్స నిర్వహించడం జరిగింది
సదరు పేషెంట్ ను పూర్తిగా కోలుకున్న అనంతరం నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది
విషయం తెలుసుకున్న కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష గారు ,వైద్య బృందాన్ని అభినందించడం జరిగింది.
🏠 Home