Banner
Watermark
రేషన్ బియ్యంలో తుట్టెలు రాళ్లు మెరిగలు
📅 04 May 2026, 03:26 PM ✍️ admin
News Image
పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మే 4 సొమవారం రోజు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాపంపిణీ ద్వారా ప్రజలకు అందచేస్తున్న రేషన్ సన్నబియ్యంలో పెద్ద రాళ్ళు, చిన్నచిన్న రాళ్ళు మెరిగలు నూకలు వస్తు న్నాయని ఆధారాలతో ప్రజావాణిలొ జిల్లాకలెక్టర్ ను కలిసి దరఖాస్తు అంద చేసినట్లు తెలిపిన కమాన్ పూర్ మండలం రొంపికుం ట నివాసి కవి రచయిత జర్నలిస్టు సామాజిక కార్యకర్త కూచన మల్లయ్య మహర్షి తెలిపారు.
పది కిలోల రేషన్ బియ్యం శుభ్రం చేస్సే 50 పెద్దరాళ్ళు 550 చిన్న చిన్నరాళ్ళు 350 మెరిగలు 700 గ్రాముల నూకలు మరియు తుట్టెలుకట్టిన బియ్యం వచ్చినట్లు ప్రజావాణిలో కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులొ తెలుపగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అలాంటి బియ్యం ఎవరు తీసుకోవద్దని ,ఈసారి నిజామాబాద్ సంబంధిం చిన బియ్యం వచ్చాయని తెలుపుతు పౌరసరఫరాల శాఖను పరిశీలించాలని ఆదేశించారని ఆయన తెలిపారు,ఎంతో ప్రతిష్టా త్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకంవల్ల ప్రభుత్వానికి మంచిపేరు రావాలంటే సంబంధించిన మంత్రి నాణ్యమైన సన్న బియ్యం పథకానికి చెడ్డపేరు తెస్తున్న మిల్లర్ల పై తగిన చర్య తీసుకొని పథకాన్ని పగడ్బంధిగ అమలుచేయాలని కోరుతూ ఈ విషయమై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పేషికి ఆధారాలతో లేకరాస్సానని ఆయన తెలిపారు
🏠 Home