అన్నం మిగిలిందా? పారవేయకండి. పంచిపెడదాం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
📅 09 May 2026, 12:51 PM
✍️ admin
సమయం రాత్రి 10.15 సేవకు సమయం అనేది లేదు అని నిరూపిస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులు వొడ్యాల వేణు
అంతలో ఒకరి ఫోన్... ఫంక్షన్ జరిగింది..... కూరలు (వెజిటబుల్) అన్నం మిగిలింది ఏమిచేద్దాం మీరు అన్నార్తులకు పంపిణీ చేయగలరా అని అనగానే పంపించండి చేద్దాం అని అట్టి మిగిలిన ఆహార పదార్థాలు రాజన్న ఆలయం వద్ద దాదాపు 100 మంది పేదలకు అన్నార్తులకు పంపిణీ చేయడం జరిగిందని, అన్నం పారవేయవద్దు.. పంచిపెడడం అని ట్రస్టు సభ్యులు వొడ్యాల వేణు అన్నారు ఈకార్యక్రమంలో వొడ్యాల వేణుతో పాటు శివాంష్ పటేల్, దురిశేటి రాజు, గోడిశెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు