పెద్దపల్లి జిల్లాలో , సుస్థిర వ్యవసాయ సంస్థ (NGO ) ఆధ్వర్యంలో,జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF ) లో భాగంగా కృషి సఖిలకు ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమము 3 వ తేదీ నుండి 7 వ తేదీ వరకు పెద్దపల్లి మండలము బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహించడం జరిగింది . ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి జిల్లాలో 15 క్లస్టర్లను ఎంపిక చేయడం జరిగింది.ఒక్కో క్లస్టర్లో 125 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎంపిక చేయడం జరిగింది.క్లస్టర్లో లోని 125 మంది రైతులను ప్రోత్సహించడానికి మరియు మెళకువలు తెలియ చేయడానికి ఒక్కో క్లస్టర్ కి ఇద్దరు మహిళలను కృషి సఖి లుగా నియమించడం జరిగింది.ఈ ఎంపిక చేసిన కృషి సఖిలకు ప్రకృతి వ్యవసాయం పై 5 రోజులపాటు ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చివరి రోజున సందర్భంగా గౌరవ జిల్లా వ్యవసాయ అధికారి గారు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందినటువంటి కృషి సఖి మహిళల కు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గారు , జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం నుండి సహాయ వ్యవసాయ సంచాలకులు కాంత రావు గారు, డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాధ్,అంజనీ , వ్యవసాయ అధికారులు అలివేణి , అనిత , LNFI ప్రతినిధులు రాజేష్,శివ,రైతు శిక్షకులు సుధాకర్ ,కృషి సఖి లు పాల్గొన్నారు
TELANGANA PEDDAPALLI
సుస్థిర వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో,జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా కృషి సఖిలకు ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమము
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం