కెకె మహేందర్ రెడ్డి
ఈ రోజు తంగళ్లపల్లి మండలం లోని రామచంద్రపూర్ గ్రామం లో నూతన గృహప్రవేశాలకు హాజరైన నియోజకవర్గం ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి గారు.
ఇందిరమ్మ ఆబయహస్తం భరోసా ద్వారా నిరుపేదలకు మంజూరు అయినా గృహలను ఈ రోజు ప్రారంభించడం జరిగింది,
లబ్ధిదారులకు మహేందర్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు కానుక గా పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం, సొంతయింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షు నేరల్ల నరసింగం గౌడ్,నాయకులు భూపతి, మాధవ రెడ్డి,స్థానిక సర్పంచ్ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బాలు, శ్రీనివాస్ రెడ్డి, పరుశురాం,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు,మండల అధికారులు, గ్రామ అధికారులు పాల్గొన్నారు.