2027 గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించే పద్మ పురస్కారాల కొరకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ, సహాయ సంచాలకులు, పి. చౌడేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హులైన చేనేత కళాకారులు తమ ప్రతిపాదనలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు.
దరఖాస్తు సమర్పణ తేదీలు: 15.03.2026 నుంచి 31.07.2026.
నోట్: ఆన్లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణన లోకి వస్తాయని, చివరి తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు.
వెబ్ సైట్: http//padmaawards.gov.in